దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. సరైన శిక్ష అంటున్న టాలీవుడ్ హీరోయిన్లు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. సరైన శిక్ష అంటున్న టాలీవుడ్ హీరోయిన్లు

Published on Dec 6, 2019 7:31 PM IST

దిశ అత్యాచార, హత్య ఘటనను సామాన్య జనంతో పాటు సినీ ప్రముఖులు కూడా తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. మన నటీమణులంతా నిందితులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈరోజు తెల్లవారుఝామున హైదరాబాద్ పోలీసులు నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ సంగతి తెలిసిన హీరోయిన్లు నిందితులకు ఇదే సరైన శిక్ష అంటూ పోలీసుల మీద ప్రసంశలు కురిపించారు.

సమంత మాట్లాడుతూ ‘ఐ లవ్ తెలంగాణ పోలీస్. భయం అనేది గొప్ప పరిష్కారం.. ఒక్కోసారి ఒన్లీ సొల్యూషన్’ అనగా పూజా హెగ్డే మాట్లాడుతూ ‘మహిళల్ని అత్యాచారం చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికీ ఇదొక గట్టి సందేశం ఇచ్చినట్టే’ అంది. నటి లావణ్య త్రిపాఠి ట్వీట్ చేస్తూ ‘ఆ నలుగురికి ఎలాంటి శిక్ష అయితే పడాలో అలాంటి శిక్షే పండింది’ అనగా మరొక నటి రష్మిక మందన్న కూడా ‘భగవంతుడు చూస్తూనే ఉంటాడు.. న్యాయం జరిగింది’ అనగా రకుల్ ప్రీత్ నిందితులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అత్యాచారం లాంటి నేరం చేసి ఎంత దూరం పారిపోతారు’ అంటూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు