తారక్ సాలిడ్ కాంబోకు ఈ వర్క్ ఫినిష్ అయ్యిందా?

తారక్ సాలిడ్ కాంబోకు ఈ వర్క్ ఫినిష్ అయ్యిందా?

Published on Oct 1, 2020 3:14 PM IST

యుంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ ఆడియెన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా మాస్ లో ఎన్నో చిత్రాలు తీసిన తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో “అరవింద సమేత” సినిమా తీసి ఒక సరికొత్త మాస్ యాంగిల్ ను రుచి చూపించారు. మొదట ఈ ఇద్దరి కాంబో అంటే మంచి క్లీన్ గా అలా కొనసాగిపోతుంది అని అనుకున్నారు.

కానీ ఊహించని రేంజ్ మాస్ స్టఫ్ ఇవ్వడంతో ఈ కాంబో అంటే సెపరేట్ అంచనాలు పెరిగిపోయాయి. దీనితో మళ్ళీ వీరి రిపీట్ కాంబో ఎప్పుడు ఉంటుందా అని తారక్ అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలోనే త్రివిక్రమ్ ఆ చల్లని కబురును కూడా అందజేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇపుడు ఒక బజ్ వినిపిస్తుంది.

త్రివిక్రమ్ ఈ చిత్రం తాలూకా స్క్రిప్ట్ వర్క్ ను పూర్తిగా ఫినిష్ చేసేసారట. ఈ విషయం తారక్ కు కూడా తెలిపినట్టు టాక్. ప్రస్తుతం తారక్ జక్కన్న రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ మల్టీ స్టారింగ్ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. మరి ఈ స్పెషల్ కాంబో ఎప్పటి నుంచి మొదలు కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు