సవ్యసాచి లేటెస్ట్ అప్ డేట్స్ !

సవ్యసాచి లేటెస్ట్ అప్ డేట్స్ !

Published on Aug 19, 2018 12:59 AM IST


‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందు మొండేటి ,నాగ చైతన్యల కలయికలో తెరకెక్కుతున్న చిత్రం సవ్యసాచి. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తరువాత ఒక సాంగ్ చిత్రీకరణ కోసం ఫారెన్ వెళ్లనుంది చిత్ర టీం. దాంతో ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ కానుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడంతో ఆలస్యమవుతూ వస్తుంది.

కీరవాణి సంగీతం అందిస్తున్నా ఈచిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. సీనియర్ నటులు మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం నవంబర్ 2న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ లోగా నాగ చైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంతో ఆగస్టు 31న ప్రేక్షలకులను పలకరించనునున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు