వరుణ్ తేజ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ ‘ఎఫ్2’ తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో “వాల్మీకి” మూవీ చేస్తున్నారు. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ తమిళ “జిగర్తాండా”కి అనువాదం. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ప్రముఖ శివక్షేత్రమైన యాగంటిలో జరుపుకుంటుంది. దానికి సంబందించిన ఓ షూటింగ్ షాట్ ఫొటో ని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘శివుని ఆశీసులలో ఈ అద్భుతమైన ప్రదేశంలో షూటింగ్ మొదలుపెట్టాం’ అని ఆయన ఓ సందేశం కూడా పోస్ట్ చేశారు. ఓ యాక్షన్ సన్నివేశానికి సంబందించిన చిత్రీకరణ కొరకు చిత్ర యూనిట్ యాగంటి వెళ్లినట్టు సమాచారం.
ఈ షెడ్యూల్ లో హీరో వరుణ్ తో పాటు సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ కూడా పాల్గొంటున్నారు.నేడు జరుగుతున్న ఈ షెడ్యూల్ కి కొరకు బయలుదేరిన వరుణ్ కారు నిన్న రాత్రి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, ఆచంట రాము, గోపినాథ్ లు 14రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు.
With the blessings of Lord Shiva of Yaganti Started shooting in this fantastic location….. #Valmiki @IAmVarunTej @Atharvaamurali @DoP_Bose @actorbrahmaji pic.twitter.com/kPBZJSZ9Lk
— Harish Shankar .S (@harish2you) June 13, 2019