మహే‌ష్‌తోనే నెక్స్ట్ సినిమా.. కన్ఫర్మ్ చేసిన దర్శకుడు

మహే‌ష్‌తోనే నెక్స్ట్ సినిమా.. కన్ఫర్మ్ చేసిన దర్శకుడు

Published on Dec 5, 2019 3:05 PM IST

మహేష బాబుతో ‘మహర్షి’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఆ తర్వాత మరో సినిమాకు కమిటవ్వలేదు. మొదటి నుండి ఆయన తన ఆరవ సినిమాను మహే‌ష్‌తోనే చేయాలని అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. చాలా రోజులు ఈ వార్తలపై స్పండించని పైడిపల్లి తాజాగా మహేష్ బాబుతోనే తర్వాతి సినిమాను చేయాలని అనుకుంటున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

ఈ చిత్రాన్ని ‘మహర్షి’ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన స్టొరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయట. పైగా ఈ చిత్రం ఒక గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై నుండి ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ఇకపోతే మహేష్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ వచ్చే యేడాది జనవరి 11న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు