వైజాగ్ లో మెగా ప్రిన్స్ యాక్షన్ !

వైజాగ్ లో మెగా ప్రిన్స్ యాక్షన్ !

Published on Feb 29, 2020 1:32 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వైజాగ్లో జరుగుతుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు.

ఈ చిత్రం కోసం నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్దలు దాదాపు రూ.35 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం వరుణ్ బరువు తగ్గి ఫిట్ లుక్ తెచ్చుకున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని సమాచారం.

ఇకపోతే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిచనున్నారు. వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో ఈ కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో, మెగా అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు