తమ్ముడు “దొరసాని” చిత్రానికి అన్న “అర్జున్ రెడ్డి” ప్రచారం

తమ్ముడు “దొరసాని” చిత్రానికి అన్న “అర్జున్ రెడ్డి” ప్రచారం

Published on Jul 13, 2019 2:21 PM IST

ఆనంద్ దేవరకొండ,శివాత్మిక లు ప్రధాన పాత్రలలో మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన దొరసాని మూవీ నిన్న విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. కాగా ఈ మూవీపై హీరో విజయ్ దేవరకొండ ప్రశంసలు కురిపించారు. దొరసాని చిత్రంలో నటించిన ఆనంద్,శివాత్మిక లతో పాటు చిత్ర దర్శకుడిని కూడాట్విట్టర్ వేదికగా పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రధాన పాత్రల నటనతో పాటు చిత్రం సహజంగా ఉంది అన్నారు. గతంలో తమ్ముడు నటిస్తున్న “దొరసాని” మూవీ కి విజయ్ ఎటువంటి సహకారం అందించడం లేదు అని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ సారి విజయ్ తొందరగానే మేలుకున్నారు.

కాగా విజయ్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ “డియర్ కామ్రేడ్” చిత్ర ప్రమోషన్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ అన్ని సౌత్ ఇండియా భాషలలో విడుదలవుతున్న నేపథ్యంలో నిన్న కేజిఎఫ్ చిత్ర హీరో యాష్ చేతుల మీదుగా కన్నడ ట్రైలర్ ని విడుదల చేశారు. విజయ్ కి తోడుగా రష్మిక నటిస్తుండగా భరత్ కమ్మా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు