విడుదలకు సిద్దమవుతున్న శివాజీ రాజా కుమారుడి చిత్రం ‘జెమ్’

విడుదలకు సిద్దమవుతున్న శివాజీ రాజా కుమారుడి చిత్రం ‘జెమ్’

Published on Oct 19, 2020 11:42 PM IST


ప్రముఖ నటుడు శివాజీ రాజా తన కుమారుడు విజయ్ రాజాను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ రాజా సోలో హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘జెమ్’. సుశీల సుబ్రమణ్యం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ ముందే షూటింగ్ పూర్తికాగా లాక్ డౌన్ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశారు టీమ్. ప్రస్తుతం అన్ని పనులు పూర్తికావడంతో ఫస్ట్ కాపీ కూడ సిద్దమైందట. దీంతో టీమ్ విడుదల సన్నాహాలు ప్రారంభించింది.

కంప్లీట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ పతాకంపై పత్తికొండ కుమారస్వామి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్ విడుదలకానున్నాయి. ఇందులో విజయ్ రాజా సరసన రాశీ సింగ్, నక్షత్ర కథానాయికలుగా నటించారు. ఇందులో యాక్షన్ డోస్ మాత్రమే కాదు మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ కూడ ఉంటుందని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లోఫర్, రోగ్, జ్యోతిలక్ష్మీ’ సినిమాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు