కళైమమణి అవార్డు అందుకున్న విజయ్ సేతుపతి

కళైమమణి అవార్డు అందుకున్న విజయ్ సేతుపతి

Published on Nov 15, 2019 3:30 PM IST

తమిళ చిత్రాలలో హీరోగా కొనసాగుతూనే ఇతర పరిశ్రమలలో తెరకెక్కే సినిమాలలో ప్రాముఖ్యం ఉన్న పాత్రలలో నటిస్తూ ఉంటారు విజయ్ సేతుపతి. ఇప్పటికే ఓ గొప్ప నటుడిగా నిరూపించుకున్న హీరో కి తమిళ నాడు గవర్నమెంట్ కళైమమణి అవార్డు తో సత్కరించింది. నేడు చెన్నైలోని సచివాలయంలో తమిళనాడు మంత్రి పొయి పాండిరాజన్ ఈ అవార్డ్ ని విజయ్ కి ప్రధానం చేయడం జరిగింది. ఇటీవల విడుదలైన సైరా నరసింహారెడ్డి చిత్రంలో విజయ్ కీలక రోల్ చేశారు. ఐతే ఆయన నటించిన తాజా చిత్రం వాయిదా పడింది.

అనుకోని ఆర్ధిక ఇబ్బందుల కారణంగా విజయ్ నటించిన విజయ్ సేతుపతి చిత్రం రెండు భాషలలో విడుదల వాయిదాపడిందని సమాచారం. దీనితో విజయ్ సేతుపతి అభిమానులు నిరుస్తాహం చెందుతున్నారట. విజయ్ సేతుపతి చిత్రాన్ని విజయ్ చందర్ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. రాశిఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు