సై, మగధీర నటుడు హీరోగా చేసిన “ఎదురీత” సెన్సార్ పూర్తి..!

సై, మగధీర నటుడు హీరోగా చేసిన “ఎదురీత” సెన్సార్ పూర్తి..!

Published on Apr 28, 2021 5:30 PM IST

చాలానే ఇండస్ట్రీలలో కమెడియన్స్ కానీ విలన్ రోల్స్ నుంచి కానీ హీరోగా టర్న్ అయ్యిన చాలా మందే కనిపిస్తారు. అలా ‘సై’, ‘మగధీర’, ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’, ‘బిందాస్’, ‘ఏక్ నిరంజన్’, ‘జయ జానకి నాయక’ లాంటి తదితర చిత్రాల్లో విలన్ రోల్స్ లో నటించి మెప్పించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఎదురీత’. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై బోగారి లక్ష్మీనారాయణ, బోగారి ఈశ్వర్ చరణ్ నిర్మించారు. బాలమురుగన్ దర్శకత్వం వహించారు.

అయితే ఈ చిత్రంలో లియోనా లిషోయ్ హీరోయిన్. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.మరి ఈ సందర్భంగా నిర్మాత బోగారి ఈశ్వర్ చరణ్ మాట్లాడుతూ “ఓ 40 ఏళ్ల మధ్యతరగతి తండ్రికి కుమారుడిపై ప్రేమ ఎన్ని సమస్యలు తీసుకువచ్చింది? అనేది సినిమా కథాంశం. ప్రతి తండ్రి, ప్రతి కుమారుడి హృదయాన్ని హత్తుకునేలా సినిమాలో భావోద్వేగాలు ఉంటాయి. సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. త్వరలో పాటలు విడుదల చేసి, చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని తెలిపారు.

అలాగే ఈ చిత్రంలో సంపత్ రాజ్, జియా శర్మ, శాన్వీ మేఘన, నోయెల్ సేన్, 30 ఇయర్స్ పృథ్వీ, ‘రంగస్థలం’ మహేష్, కాశి విశ్వనాథ్, రవిప్రకాష్, భద్రమ్, ‘మాస్టర్’ చరణ్ రామ్ తదితరులు నటించారు.

వీరితో పాటుగా ఈ చిత్రానికి సాంకేతిక విభాగానికి వస్తే ఛాయాగ్రహణం: విజయ్ ఆర్పుదరాజ్ (రత్నవేలు దగ్గర కుమారి21ఎఫ్, బ్రహ్మోత్సవం, లింగ చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు), పాటల రచయితలు: డా. చల్లా భాగ్యలక్ష్మి, శ్రేష్ఠ, రోల్ రిడా, విశ్వ, స్వామి, ఎడిటర్: నగూరన్ రామచంద్రన్, మ్యూజిక్ డైరెక్టర్: అరల్ కొరెల్లి , పోస్టర్ డిజైన్: అనిల్ భాను, పీఆర్: నాయిడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), దర్శకుడు: బాలమురుగన్ (దర్శకుడు విజయ్ మిల్టన్ దగ్గర ‘గోలి సోడా’, ‘కడుగు’, తెలుగులో ‘టెన్’గా విడుదలైన విక్రమ్, సమంత సినిమాకు దర్శకత్వ శాఖలో పని చేశారు), నిర్మాత : బోగారి లక్ష్మీనారాయణ, బోగారి ఈశ్వర్ చరణ్ వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు