చిరు కోసం పక్కా ప్లానింగ్ లో ఉన్న వినాయక్!

చిరు కోసం పక్కా ప్లానింగ్ లో ఉన్న వినాయక్!

Published on Oct 1, 2020 6:48 PM IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ఒక భారీ ప్రాజెక్ట్ “ఆచార్య” లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం అనంతరం చిరు లైన్ లో రెండు రీమేక్ చిత్రాలు ఉంచుకొన్నారు. అవే లూసిఫర్ మరియు వేదాళం రీమేక్ చిత్రాలు.

ఈ రెండు చిత్రాలను సీనియర్ దర్శకులు వివి వినాయక్ మరియు మెహర్ రమేష్ లు తెరకెక్కించనున్నారు. అయితే వీటిలో వేదాళం రీమేక్ కు మెహర్ స్క్రిప్ట్ ను ఎప్పుడో పూర్తి చేసారని టాక్ వినిపించింది. ఇక అలాగే లూసిఫర్ రీమేక్ విషయానికి వస్తే పలు ఆసక్తికర అంశాలే టాక్ లా వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి గాను వినాయక్ ఆస్థాన రచయిత అయినటువంటి ఆకుల శివ ఈ చిత్రానికి స్క్రిప్ట్ పని చూసుకోనున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా మన నేటివిటీకి తగ్గట్టుగా శివ స్క్రిప్ట్ ను మార్చనున్నారని టాక్. అంతే కాకుండా ఈ చిత్రం షూట్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలు పెట్టే ప్లానింగ్ లో ఉన్నారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు