మంచు విష్ణు ‘జిన్నా’ విడుదల వాయిదా !

మంచు విష్ణు ‘జిన్నా’ విడుదల వాయిదా !

Published on Sep 26, 2022 9:30 AM IST

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అందాల భామలు సన్నీలియోన్ మరియు పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. ఐతే, తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. మొదట అక్టోబర్ 5, 2022న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, తాజాగా అక్టోబర్ 21, 2022కి ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. అయితే, టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చిత్రబృందం, ఈ సినిమా పై క్యూరియాసిటీని పెంచుతూనే ఉంది. ఈ సినిమాను రకరకాలుగా ప్రమోట్ చేస్తోంది. కాగా AVA ఎంటర్‌టైన్‌మెంట్ & 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ జిన్నా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు