‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం దర్శకుడిగా మారాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ దర్శకత్వంలో ‘ఫలక్ నుమా దాస్’ అనే చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఈ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. కానీ ఈ సారి దర్శకుడిగా కాదు, హీరోగా మరో చిత్రానికి సైన్ చేశాడు.
విశ్వక్ సేన్ హీరోగా ప్రదీప్ పులివర్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ‘కార్టూన్’ అనే చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. డిఫరెంట్ జోనర్లో ఈ సినిమా తెరకెక్క బోతుందట. జూన్ 3 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.