చివరి షెడ్యూల్లో అజిత్ ‘విశ్వాసం’ !

చివరి షెడ్యూల్లో అజిత్ ‘విశ్వాసం’ !

Published on Oct 23, 2018 1:00 AM IST

శివ దర్శకత్వంలో తల అజిత్ నటిస్తున్న ‘విశ్వాసం’చిత్రం యొక్క షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈచిత్రం యొక్క చివరి షెడ్యూల్ ముంబై లో జరుగుతుంది. వచ్చే నెల నవంబర్ మెదటి వారంలో ఈ షెడ్యూల్ ను పూర్తి చేయనున్నారు.
దాంతో ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తికానుంది.

అజిత్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్ర తమిళ థియేట్రీకల్ హక్కులను 48కోట్ల భారీ ధర కు కేజేఆర్ స్టూడియోస్ దక్కించుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలువనున్న ఈ చిత్రం ఫై బారి అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు