వెంకీ మామ జోడీని ప్రచారంలో పక్కన పెట్టేస్తున్నారే.. !

వెంకీ మామ జోడీని ప్రచారంలో పక్కన పెట్టేస్తున్నారే.. !

Published on Dec 5, 2019 1:53 PM IST

సురేష్ బాబు లాంటి సీనియర్ నిర్మాత తన తమ్ముడు వెంకటేష్,మేనల్లుడు నాగ చైతన్య లతో నిర్మించిన ‘వెంకీ మామ విడుదల తేదీ విషయంలో చాలా రోజులు స్పష్టత ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐతే సడన్ గా వెంకీ మామ చిత్రం ఈనెల 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి సినీ ప్రేమికుల కన్ఫ్యూషన్ కి తెరదించారు. విడుదలకు ఇంకా కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రచారంలో భాగంగా నిన్న చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వెంకటేష్, చైతన్య మరియు రాశి ఖన్నా చిత్ర నిర్మాతలైన సురేష్ బాబు, టి జి విశ్వ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కాగా వెంకీ మామ చిత్రంలో మరో హీరోయిన్ అయిన పాయల్ రాజ్ పుత్ ఈ కార్యక్రమంలో కనిపించకపోవడం కొంచెం వెలితిగా అనిపించింది.అలాగే ఈ కార్యక్రమంలో ప్రసంగించిన నిర్మాతలు సురేష్ బాబు, విశ్వ ప్రసాద్ , హీరో చైతూ, రాశి ఖన్నాలు వారి ప్రసంగాలలో కనీసం ఆమె పేరును ప్రస్తావించకపోవడంతో అసలు ఈ కార్యక్రమానికి ఆమెను పిలిచారా లేదా అనే అనుమానం కలుగుతుంది. వెంకటేష్ మాత్రం కేవలం ఒకసారి అందరితో పేర్లతో పాటు ఆమె పేరు పలికారు. వెంకీ మామ టీమ్ కి పాయల్ కి మధ్య అంత సఖ్యత లేదని, కొన్ని కారణాల వలన ఆమె దర్శక నిర్మాతలతో పాటు నటులతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని మొదటినుండి వినిపిస్తున్న మాట. నేటి సంఘటనతో ఈ వాదనకు బలం చేకూర్చినట్లయింది. మరి త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ వేడుకలో కూడా పాయల్ కనిపించలేదంటే ఉద్దేశపూర్వకంగా పాయల్ ని ప్రొమోషన్స్ కి దూరం పెడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు