యాత్ర విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చారు !

యాత్ర విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చారు !

Published on Oct 19, 2018 2:31 PM IST

దివంగత నేత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర తో మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈచిత్రం డిసెంబర్ 21న విడుదల కానుందని క్లారిటీ ఇచ్చారు చిత్ర నిర్మాతలు. ఇక అదే రోజు వైఎస్సార్ తనుయుడు వైఎస్ జగన్ పుట్టిన రోజు కూడా కావడం విశేషం.

జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రాన్ని 70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు