సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఆంధ్రాపోరి’..!

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఆంధ్రాపోరి’..!

Published on May 26, 2015 9:03 AM IST

andhra-pori

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్‌ పూర్తి స్థాయి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఆంధ్రాపోరి’. ప్రతిష్టాత్మక ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించబడ్డ ఈ సినిమాకు ‘ఋషి’ సినిమా ఫేం రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఉల్కా గుప్తా హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే అన్ని టెక్నికల్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

మరాఠీలో అప్పటివరకూ ఉన్న రికార్డులను తుడిచిపెట్టిన ‘టైమ్‌పాస్’ సినిమాకు రీమేకే ఈ ‘ఆంధ్రాపోరి’. సెన్సార్ బృందం ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ రిపోర్ట్ బాగుందని, సెన్సార్ సభ్యులు సినిమాకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని సినిమా యూనిట్ చెబుతోంది. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సరైన రిలీజ్ డేట్ కోసం సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. జూన్ 5న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈలోగా సినిమాను వీలైనంత వరకూ ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళేందుకు ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు