తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను, ఆడియో ను మే 31 న హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. చిత్ర ట్రైలర్ కంటే ముందు, డైరెక్టర్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ చిత్రంపై భారీ అంచనాలు నెలకొల్పుతున్నారు. దీంతో ఈ చిత్ర ఆడియో ప్రత్యక్ష ప్రసారాలను ప్రసారం చేసేందుకు ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5 భారీ ధర చెల్లించి ప్రత్యక్ష ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. కాగా ఇప్పటికే లహరి ఆడియో సంస్ద ఈ చిత్ర ఆడియో హక్కులను దాదాపు రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఆర్కా మీడియా వర్క్స్ పై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాహుబలి ఆడియో టెలికాస్ట్ కు భారీ ధర
బాహుబలి ఆడియో టెలికాస్ట్ కు భారీ ధర
Published on May 23, 2015 9:23 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- బజ్ : మ్యూజికల్ అప్ డేట్ కి రెడీ అవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ ?
- SSMB 29 : అందుకే మహేష్, రాజమౌళి హఠాత్తుగా తిరిగివచ్చారా ?
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?