సిట్ విచారణపై హైకోర్టును ఆశ్రయించిన ఛార్మి !

సిట్ విచారణపై హైకోర్టును ఆశ్రయించిన ఛార్మి !

Published on Jul 24, 2017 12:51 PM IST


డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న 12మంది సెలబ్రిటీలలో హీరోయిన్ ఛార్మి కూడా ఒకరు. ఈ నెల 26వ తేదీన ఆమె ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. ఈ నైపథ్యంలో ఆమె సిట్ విచారణ బాగోలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఆర్టికల్ 20 షబ్ క్లాజ్ 3 ప్రకారం ఆమె వేసిన ఈ పిటిషన్లో సిట్ విచారణ సంతృప్తికరంగా లేదని, విచారణ సమయంలో బలవంతంగా శాంపిల్స్ సేకరిస్తున్నారని, అలా చేయకూడదని, అలాగే విచారణ సమయంలో అడ్వకేట్ ను వెంట తీసుకెళ్లే వెసులుబాటును కల్పించాలని పేర్కొన్నారు. ఛార్మి పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం దాన్ని విచారించే అవకాశముంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు