‘సినిమా చూపిస్త మావ’ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్!

‘సినిమా చూపిస్త మావ’ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్!

Published on Aug 28, 2015 5:32 PM IST

CCM
‘ఉయ్యాల జంపాల’ లాంటి హిట్ సినిమాతో సినీ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్, రెండో సినిమా ‘సినిమా చూపిస్త మావ’ ద్వారా మరో హిట్‌తో మళ్ళీ మనల్ని పలకరించారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఆగష్టు 14న విడుదలై నేటితో మూడో వారంలోకి ప్రవేశించింది. విడుదలైన నాటినుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న ఈ సినిమా ఆడియోకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియో రిలీజ్ అప్పట్నుంచే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఆల్బమ్, సినిమా రిలీజ్ తర్వాత మరింత పాపులర్ అయ్యాయి.

ఇక ఈ నేపథ్యంలోనే ఆడియోకు, సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సినిమా యూనిట్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ ఉదయం జరిగిన ఈ ఫంక్షన్‌కు ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరై సినిమా యూనిట్‌కు జ్ఞాపికలను అందజేశారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సినిమా చూపిస్త మావ దర్శకుడు త్రినాథరావు, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తమ సినిమాకు ఈ స్థాయి విజయాన్ని తెచ్చిపెట్టిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ సినిమాకు శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్‌కు ఈ మధ్య కాలంలో ఏ చిన్న సినిమాకూ రానంత పాపులారిటీ మార్కెట్లో వచ్చిందని నిర్మాత ఈ సందర్భంగా తెలిపారు. చిన్న సినిమా ఆడియోకు రెస్పాన్స్ అంతంతమాత్రమే అయిన ఈ రోజుల్లో సినిమా చూపిస్త మావ ఆడియో అతి కొద్దికాలంలోనే బ్రేక్ ఈవెన్‌ను చేరుకోవడం అభినందించదగ్గ విషయమని అతిథులు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు