‘దొంగాట’ సెన్సార్ పూర్తి..!

‘దొంగాట’ సెన్సార్ పూర్తి..!

Published on Apr 24, 2015 1:25 PM IST

Dongatta
అడవి శేష్, మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘దొంగాట’. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మి స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా వంశీ కృష్ణ అనే కొత్త దర్శకుడు సినీ పరిశ్రమకు పరిచయం కానున్నారు. మంచు లక్ష్మి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో కనిపించడం విశేషం. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే టెక్నికల్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది.

తాజాగా ఈ సాయంత్రం సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కావడంతో సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయ్! త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు నిర్మాత మంచు లక్ష్మి తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు