సూర్యతో పాటు 8 మంది తమిళ నటీనటులపై నాన్ బెయిలబుల్ వారెంట్ !

సూర్యతో పాటు 8 మంది తమిళ నటీనటులపై నాన్ బెయిలబుల్ వారెంట్ !

Published on May 23, 2017 4:24 PM IST


ప్రముఖ స్టార్ హీరో సూర్య పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఆయనతో పాటు మరో ఏడుగురు స్టార్ నటీనటులపై కూడా ఈ వారెంట్ ఇష్యూ చేయబడింది. వివరాల్లోకి వెళితే 2009 లో ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నటీనటులు తీవ్రస్థాయిలో వ్యతిరేకత తెలిపారు. దీంతో ఆ జర్నలిస్ట్ సూర్యతో పాటు సత్యరాజ్, చేరన్, విజయ్ కుమార్, శరత్ కుమార్, అరుణ్ విజయ్, వివేక్ మరియు శ్రీ ప్రియలపై ఊటీ, నీలగిరి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

కేసును స్వీకరించిన కోర్టు ఇప్పటి వరకు వారిని రెండు సార్లు విచారణ నిమిత్తమై కోర్టుకు హాజరుకమ్మంది. కానీ ఈ నటీనటులెవరూ కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అలాగే కేసును జూన్ 17 కు వాయిదా వేస్తున్నట్టు కూడా తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు