రంగస్థలం నైజాం షేర్ ఎంతంటే !

రంగస్థలం నైజాం షేర్ ఎంతంటే !

Published on May 20, 2018 7:06 PM IST

రామ్ చరణ్ ,సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం రంగస్థలం.ఈ సినిమా అఖండ విజయం సాధించి కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులని సృష్టిస్తుంది. నైజాం ఏరియాలో ఇప్పటివరకు ఈ చిత్రం 27.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలించింది. నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రం రెండు రోజుల క్రితం అభిమానుల సమక్షంలో 50 డేస్ ఫంక్షన్ ని జరుపుకుంది. విలెజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ చిట్టి బాబు పాత్రలో కనిపించారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు