సింగర్ గా మారిన రాశి ఖన్నా.

సింగర్ గా మారిన రాశి ఖన్నా.

Published on Aug 23, 2014 8:10 AM IST

Rashi-Khanna

ఎవరో పాడిన పాటకు హీరో హీరోయిన్లు స్టెప్పులు వేయడం సర్వ సాధారణం. ఆ పాటను హీరోయిన్ స్వయంగా పాడితే విశేషమే. శృతి హాసన్, కలర్స్ స్వాతి, శ్రద్ధా దాస్ వంటి హీరోయిన్లు పాటలు పాడిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో ‘ఊహలు గుసగుసలాడే’ హీరోయిన్ రాశి ఖన్నా చేరింది.

‘గుండెల్లో గోదారి’ ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘జోరు’. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు ఒక పాట కూడా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతంలో సింగర్ గా పరిచయం కాబోతుంది. ‘చిన్నప్పటి నుండి పాడాలనే నా కోరిక నేటితో తీరింది. సింగింగ్ ఫర్ జోరు’ అంటూ ట్వీట్ చేసింది.

శ్రీ కీర్తి ఫిల్మ్స్ పతాకంపై అశోక్, నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘కిస్’ ఫేం ప్రియ బెనర్జీ, సుష్మ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు