విలక్షణ దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఓ స్టైలిష్ రివెంజ్ డ్రామాతో హిట్ కొట్టిన సుకుమార్, ఈసారి రామ్ చరణ్తో విలేజ్ డ్రామాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాను మొదట నవంబర్లోనే సెట్స్పైకి తీసుకెళ్ళాలనుకున్నా, ప్రీ ప్రొడక్షన్కి మరికాస్త సమయం కేటాయించాలన్న ఆలోచనతో డిసెంబర్కు వాయిదా వేశారు.
ఇక ఇప్పుడు సినిమా సెట్స్పైకి వెళ్ళడం డిసెంబర్కు వాయిదా పడడంతో టీమ్లో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా వచ్చి చేరిపోయారు. ‘ఖైదీ నెం 150’కి సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తోన్న రత్నవేలు, నవంబర్లోనే సుకుమార్ సినిమా సెట్స్పైకి వెళుతుందని మొదట నో చెప్పారట. ఇప్పుడు అన్నీ కుదరడంతో మళ్ళీ టీమ్లో జాయిన్ అయ్యారు. సుకుమార్తో ఆర్య, జగడం, నేనొక్కడినే లాంటి సినిమాలకు పనిచేసిన రత్నవేలు ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకు పనిచేయడం విశేషంగా చెప్పుకోవాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా సుకుమార్ స్టైల్లో ఎమోషన్స్కు పెద్ద పీట వేసేలా ఉంటుందట.