కొత్త జోనర్లో సినిమా చేయబోతున్న తేజు !

కొత్త జోనర్లో సినిమా చేయబోతున్న తేజు !

Published on Jul 3, 2018 11:27 PM IST

sai dharam tej1

ఇప్పటివరకు యాక్షన్ మరియు లవ్ ఎంటర్టైనర్ సినిమాల్లోనే నటించిన సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం కొత్త జోనర్లో సినిమా చేయనున్నాడు. కథారచయిత నుండి దర్శకుడిగా మారిన ‘బిందాస్’ ఫెమ్ వీరు పోట్ల చారిత్రక నేపథ్యంలో ఒక కథను సిద్ధం చేశాడట. ఈ చిత్రంలో హీరోగా నటించనున్నాడట తేజు. శ్రీ కృష్ణదేవరాయలు కాలం నాటి కథతో సాగె ఈ పీరియాడిక్ మూవీకి సంబంధించిన వివరాలను తొందర్లోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ఇక ప్రస్తుతం తేజు నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. కరుణాకరన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో తేజు కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. జులై 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఫై తేజు చాలా ఆశలే పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు