గత సంవత్సరం బిగ్ బాస్ తెలుగు టైటిల్ గెలుచుకున్న విజేత కౌశల్ మండా సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటుంటాడు. కాగా పుల్వామాలోని ఫిబ్రవరీ 14వ తేదీన సీఆర్పీఎఫ్ జవాన్ల పై ఉగ్రవాదులు చేసిన నీచమైన దాడి గురించి తెలిసిందే. ఈ కన్నీటి దుశ్చర్య సంఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ వంతుగా సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు విరాళాలను ప్రకటించారు. కాగా తాజాగా కౌషల్ కూడా సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాల కోసం తన వంతుగా రూ.50 వేల రూపాయిలను విరాళంగా ప్రకటించాడు.