స్వీటీ అనుష్క ముఖానికి రంగు వేసుకొని చాలాకాలమైంది. ఆమె 2018లో విడుదలైన ‘భాగమతి’ తరువాత ఎటువంటి మూవీ కి సైన్ చేయలేదు. మళ్లి తెరపై ఆమెను ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న అనుష్క అభిమానులకు ఓ స్వీట్ న్యూస్. అనుష్క ఎట్టకేలకు ‘సైలెంట్’ అనే మూవీలో నటించడానికి అంగీకరించారు. తమిళ్ హీరో మాధవన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ లో అంజలి మరియు షాలినీ పాండే ప్రధాన పాత్రలలో నటించనున్నారు.కథరీత్యా ఈ చిత్రం అధిక భాగం అమెరికాలో చిత్రీకరించనున్నారు. కనుక అనుష్క తో పాటు చిత్ర యూనిట్ త్వరలో అమెరికా వెళ్లనున్నారని సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు,తమిళ్ మరియు హిందీ భాషలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎప్పుడో 2006 వచ్చిన ‘రెండు’ మూవీ తరువాత అనుష్క,మాధవన్ ఇన్నేళ్లకు కలిసినటిస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మే 3న ఆహా లోకి క్రైమ్ థ్రిల్లర్ ‘అసురగురు’
- సమీక్ష : “బాక్” – రొటీన్ హారర్ థ్రిల్లర్ !
- సమీక్ష : “ఆ ఒక్కటీ అడక్కు” – కొన్ని నవ్వుల కోసం మాత్రమే
- ఎక్స్ క్లూజివ్ : ఈ బయోపిక్ కి వినూత్న పాత్రలో నివేత థామస్
- సమీక్ష : “శబరి” – ఆకట్టుకోని నాన్ ఎమోషనల్ థ్రిల్లర్
- సమీక్ష : “ప్రసన్నవదనం” – కొన్నిచోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా!
- “లవ్ టుడే” హీరో నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్!