జాతీయ అవార్డ్ అందుకున్న మహర్షి టీమ్ పై టాలీవుడ్ ప్రముఖులు, ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అవార్డ్ అందుకోవడం పట్ల మహర్షి చిత్రం డైరెక్టర్ వంశీ పైడిపల్లి సోషల్ మీడియా ద్వారా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకోవడం గౌరవం గా, వినయం గా ఉందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా మహర్షి టీమ్ కి చెందింది అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ సార్, ఇది సినిమా పై మీకున్న నమ్మకం కోసం అంటూ చెప్పుకొచ్చారు. ఉత్తమ జనాదరణ పొందిన చిత్రం గా మహర్షి అవార్డ్ అందుకోవడం పట్ల మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
#NationalFilmAwards..Truly Honoured and humbled by receiving the National Award from the @VPSecretariat..This totally belongs to the Team of #Maharshi..@urstrulyMahesh Sir, this is for Your trust on this film@hegdepooja @allarinaresh @ThisIsDSP @rgvhari@ahishor
@KUMohanan1 pic.twitter.com/wwj2ExrUrU— Vamshi Paidipally (@directorvamshi) October 26, 2021