మెగాస్టార్ చిరంజీవి కేవలం సినిమాల పరంగానే కాకుండా ఇండస్ట్రీలో, అభిమానుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా సాయం చేస్తూ ఆదుకుంటుంటాడు. అయితే మరోసారి చిరంజీవి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తన వీరాభిమాని కూతురి పెళ్లికి ఆర్థిక సాయం అందించాడు.
వివరాల్లోకి వెళితే రాజం కొండలరావు అనే వ్యక్తి చిరంజీవికి వీరాభిమాని. ఇటీవలె ఆయన కూతురు నీలవేణి పెళ్లి కుదిరింది. అయితే తన అభిమాని ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్నాడని తెలుసుకున్న చిరంజీవి వెంటనే అతడికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. కాగా ఈ విషయాన్ని చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్ మీడియా వేదికగా తెలియచేశాడు.
లక్షణనమైన పెళ్లికూతురు నీలవేణి కి మెగాస్టార్ ఆశీస్సుల లక్ష రూపాయలు విరాళం.
రాజాం కొండలరావు గారు మొదట్నుంచీ శ్రీ చిరంజీవి గారి వీరాభిమాని.ఆయన కూమార్తె నీలవేణి పెళ్లి కుదిరింది. సమాచారం అందుకున్న @KChiruTweets గారు లక్షరూపాయల ఆర్ధిక చేయూతనిచ్చి పెళ్లి సజావుగా జరిపించమన్నారు pic.twitter.com/YVmpUaSR4b— Ravanam Swami naidu (@swaminaidu_r) February 1, 2022