మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో వర్షంలో జరిగే ఫైట్ సన్నివేశాలు ప్రస్తుతం హైదరాబాద్లోని జూబ్లి హిల్స్ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ ఫైట్ సీక్వెన్స్ లో రామ్ చరణ్, అతనితో పాటుగా కోట శ్రీనివాస్ రావు, సాయి కుమార్ మొదలగు వారు పాల్గొంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఎవడు కోసం వర్షంలో ఫైట్ చేస్తున్న చరణ్
ఎవడు కోసం వర్షంలో ఫైట్ చేస్తున్న చరణ్
Published on Mar 21, 2013 5:05 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మే 3న ఆహా లోకి క్రైమ్ థ్రిల్లర్ ‘అసురగురు’
- ఎక్స్ క్లూజివ్ : ఈ బయోపిక్ కి వినూత్న పాత్రలో నివేత థామస్
- “లవ్ టుడే” హీరో నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్!
- “ప్రసన్న వదనం” యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ సినిమా – హీరో సుహాస్
- “దూత 2” లో “పొలిమేర” నటికి ఛాన్స్!?
- ఇంట్రెస్టింగ్ గా “కుబేర” నుండి నాగార్జున ఫస్ట్ లుక్!
- గ్లోబల్ గా “పుష్ప పుష్ప” రూల్ సెన్సేషన్