బన్నీ పాన్ ఇండియా సెన్సేషన్ “పుష్ప” కి ఏడాది.!

బన్నీ పాన్ ఇండియా సెన్సేషన్ “పుష్ప” కి ఏడాది.!

Published on Dec 17, 2022 4:00 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన ఎన్నో చిత్రాల్లో పాన్ ఇండియా లెవెల్లో తనని ఐకాన్ స్టార్ గా నిలబెట్టిన చిత్రం “పుష్ప”. అప్పటికి బన్నీ అలాగే సుకుమార్ మరియు దేవిశ్రీ ప్రసాద్ ల కాంబినేషన్ అంటే ఒక సెన్సేషన్ ఉంది అప్పటికే ఇద్దరి నుంచి వచ్చిన రెండు చిత్రాలు క్లాసిక్ గా నిలవగా హ్యాట్రిక్ సినిమాగా “పుష్ప” ని అనౌన్స్ చేయడం దీనితోనే పాన్ ఇండియా ఎంట్రీ అల్లు అర్జున్ నుంచి మొదటి సారి ప్లాన్ చేయడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.

మరి ఎక్కడో డౌట్ ఉన్నప్పటికీ పాన్ ఇండియా మార్కెట్ లో అల్లు అర్జున్ తన దమ్ము చూపించి అయితే అదరగొట్టాడు. మరి ఎన్నో అంశాల్లో ఈ చిత్రం సెన్సేషన్ ని సెట్ చెయ్యగా గత ఏడాదికి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం నేటికి రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి చేసుకుంది దీనితో అయితే చిత్ర యూనిట్ ఈ స్పెషల్ డే కి గాను ఈ సినిమా నెలకొల్పిన అవార్డులు, రివార్డులు గుర్తు చేసుకున్నారు. ఇక ఈ చిత్రంపై సీక్వెల్ పుష్ప ది రూల్ పై అయితే పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొనగా ఇప్పుడు అభిమానులు పుష్ప 1 ట్రెండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు