చెన్నైలో సర్కార్ ను దాటేసిన 2.0 !

చెన్నైలో సర్కార్ ను దాటేసిన 2.0 !

Published on Nov 30, 2018 9:33 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సైంట్ఫిక్ థ్రిల్లర్ ‘2.0’ నిన్న విడులదై అద్భుతమైన రివ్యూస్ ను రాబట్టి బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ చిత్రం చెన్నై లో మొదటి రోజు ‘సర్కార్’ రికార్డు ను బ్రేక్ చేసింది.

అక్కడ ఈ చిత్రం 2.64కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి కొత్త రికార్డు సృష్టించింది. ఇక ఇంతకుముందు సర్కార్ దీపావళి రోజు విడుదలై 2.37కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ వారాంతంలో 2.0 మరింత ఎక్కువగా వసూళ్లను రాబట్టడం ఖాయం గా కనిపిస్తుంది. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సుమారు 550కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు