ఎమోషనల్ ట్వీట్ చేసిన హీరో !

ఎమోషనల్ ట్వీట్ చేసిన హీరో !

Published on Jul 12, 2020 2:27 PM IST

“ఆర్ఎక్స్ 100” అనే బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించాడు దర్శకుడు అజ‌య్ భూప‌తి అండ్ హీరో కార్తికేయ. ఈ చిత్రం బాక్స్ అఫీస్ వద్ద భారీ షేర్‌ను రాబట్టుకుంది. దీంతో హీరోగా కార్తికేయ సినీ పరిశ్రమలో రాణించడానికి ఈ సినిమా గట్టి పునాది అయింది. అయితే ఈ రోజుతోటి ఈ సినిమా రిలీజ్ అయి రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా కార్తికేయ ట్వీట్ చేస్తూ.. “జూలై 12.. ఈ రోజు నా జీవితంలో నేను లేచి నిలబడిన రోజు. నా జీవితంలో నాకు అద్భుతాల పై నమ్మకం, కలల పై విశ్వాసం, జీవితంలో ఆశ కల్పించిన రోజు ఇది. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు నా పునర్జన్మను ఇచ్చిన రోజు. నా పునర్జన్మ తండ్రి అజయ్ భూపతికి నా జీవితమంతా రుణపడి ఉంటాను” అని ఎమోషనల్ ట్వీట్ చేశారు.

ఇక కార్తికేయ ప్రస్తుతం “చావు కబురు చల్లగా” చిత్రంలో హీరోగా, లావణ్య త్రిపాఠిను హీరోయిన్ గా నటిస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. అక్టోబర్ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రానుంది. విభిన్నమైన పాత్రలో నటించే కార్తికేయ ఈ మూవీలో బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు