ఇది “సర్కారు వారి పాట” పోస్ట్ పోన్ పై మరో క్లారిటీ.?

ఇది “సర్కారు వారి పాట” పోస్ట్ పోన్ పై మరో క్లారిటీ.?

Published on Jan 23, 2022 10:00 AM IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకుని మహేష్ అభిమానులు ఎంతో కాలం నుంచి చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా ఇది.

అయితే ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు మరింత ఆసక్తిగా చూస్తుండగా ఈ సినిమా వాయిదా పట్ల మాత్రం అనేక ఊహాగానాలు ఇంకా ఆగడం లేదు.. అయితే ఆల్రెడీ ఇపుడు ఏప్రిల్ 1 కి సినిమా ఫిక్స్ అయ్యి ఉందని తెలిసిందే. కానీ ఈ డేట్ కి కూడా అనుమానమే అని మరిన్ని ఊహాగానాలు వైరల్ అవుతూ దాదాపు నిజం అనేలా అనిపిస్తున్నాయి.

లేటెస్ట్ గా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం అయితే మహేష్ ఇంకా కాస్త బ్రేక్ తీసుకొని సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నారట. అయితే దాదాపు మార్చ్ లో ఈ సినిమా షూట్ కి పాల్గొంటారని తెలుస్తుంది. అంటే ఆ షూట్ స్టార్ట్ అయ్యి ముగిసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసి ప్రీ రిలీజ్ వేడుకలు చాలా తతంగం ఉంటుంది. మరి ఈ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ పోస్ట్ పోన్ తప్పేలా లేదనిపిస్తుంది. మరి వేచి చూడాలి ఏం జరుగుతుందో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు