త్వరలో టీవీ ప్రీమియర్ గా “అహింస”

త్వరలో టీవీ ప్రీమియర్ గా “అహింస”

Published on Dec 3, 2023 3:04 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అహింస థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే త్వరలో ఈ అహింస చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

టీవీ ప్రీమియర్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారి, రజత్ బేడి, కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని అందించారు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు