క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకున్న రైజింగ్ హీరోయిన్ !

క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకున్న రైజింగ్ హీరోయిన్ !

Published on May 7, 2019 1:01 PM IST

సౌత్ లో నయనతార తరువాత ఆరేంజ్ లో సినిమాలతో ఫుల్ బిజీగా వుంది యంగ్ హీరోయిన్ ఐష్వర్య రాజేష్. ఏడాది కి అరడజను కు పైగా సినిమాలు చేస్తుంది ఈ ట్యాలెంటేడ్ బ్యూటీ. ప్రస్తుతం ఐశ్వర్య తెలుగులో మూడు సినిమాలతో అలాగే తమిళంలో రెండు సినిమా తో బిజీగా వుంది. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుంది.

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ 16వ చిత్రంలో ఐష్వర్య హీరోయిన్ గా నటించనుంది. పాండిరాజ్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్ గా కనిపించనుండగా సూరి ,యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. డి ఇమ్మాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు