జూలై నుండి అఖిల్ మొదలెట్టనున్నాడు ?

జూలై నుండి అఖిల్ మొదలెట్టనున్నాడు ?

Published on May 12, 2019 9:50 AM IST

అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న సినిమాకి ఇప్పటికే స్క్రిప్ట్ అయిపొయింది. అలాగే మిగిలిన నటీనటులు గురించి ఓ క్లారిటీ వచ్చింది. రష్మికా మండన్నను హీరోయిన్ గా తీసుకోనున్నారని ఆ మధ్య వార్తలు అయితే వచ్చాయి కానీ, ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. భాస్కర్ కొత్తవాళ్ళను కూడా చూస్తున్నారట. ఐతే క్యారెక్టర్ పరంగా చూసుకుంటే స్టార్ హీరోయిన్ అయితే న్యాయం జరుగుతుందని.. స్టార్ హీరోయిన్ కోసం చూస్తున్నారట. త్వరలో హీరోయిన్ ఫైనల్ అవుతుందని తెలుస్తోంది. కాగా జూలై నుంచి షూటింగ్ మొదలవ్వతుందట.

మరోపక్క అఖిల్ సినిమాకు నాగార్జున కూడా డబ్బులు పెడుతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. కాగా భాస్కర్ బొమ్మరిల్లు సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు