అల్లరి నరేష్ సినిమాలంటే రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునే సినిమాలుగా అందరూ చెబుతుంటారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తర్వాత హాస్యకథా చిత్రాలతో ఆ స్థాయిని సొంతం చేసుకున్న హీరోగా అల్లరి నరేష్కు పేరుంది. ఇప్పటివరకూ నటుడిగా, నిర్మాతగానే గుర్తింపు తెచ్చుకున్న నరేష్, తన తాజా చిత్రం ‘జేమ్స్బాండ్’లో ఓ పాటకు గొంతు కలిపారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ జేమ్స్బాండ్ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా శ్రీనువైట్ల దగ్గర అసోసియేట్గా పనిచేసిన సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.
సాయి కార్తీక్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియోను నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఈ సినిమాలో ‘వద్దే వద్దు మ్యారేజీ’ అంటూ సాగే ఓ పాటకు అల్లరి నరేష్ గొంతు కలిపారు. పాటకు ముందొచ్చే సాకీ పార్ట్ను నరేష్ తన స్టైల్లో ఆలపించి మెప్పించారు. ఇక ‘జేమ్స్బాండ్’ అనే పేరు, ‘నేను కాదు.. నా పెళ్ళాం’ అనే ట్యాగ్లైన్తో బయటకొచ్చిన ఈ సినిమా, ఫస్ట్లుక్ పోస్టర్తోనే అటెన్షన్ క్రియేట్ చేసింది. నిన్నే విడుదలైన ట్రైలర్ ద్వారా ఈ సినిమా ఔట్ అన్డ్ ఔట్ కామెడీ సినిమా అని అర్థమైపోయింది. అల్లరి నరేష్ మళ్ళీ తన మార్క్ సినిమాతో వస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మే నెలాఖర్లో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.
సాంగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


