ఫస్ట్ రైటర్స్ కు గౌరవం ఇవ్వాలి – అల్లు అర్జున్

ఫస్ట్ రైటర్స్ కు గౌరవం ఇవ్వాలి – అల్లు అర్జున్

Published on Nov 12, 2018 9:46 AM IST

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు రాహుల్ శంకృష్ణన్ దర్శకత్వంలో రాబోయే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘టాక్సీవాలా’. రాత్రి జరిగిన ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘సినిమాకి సంబంధించి ఫస్ట్ రైటర్స్ కు థాంక్యూ చెప్పాలి. ఎందుకంటే మన కల్చర్ ను మన నెక్స్ట్ జనరేషన్ కి తీసుకెళ్లేది సాహిత్యమే. సినిమా ఇండస్ట్రీకి అందరూ గుర్తింపు కోసం వస్తారు. అందరరికీ మంచి గుర్తింపు వస్తోంది. కానీ అందరికంటే తక్కువ గుర్తింపు వచ్చేది.. అందరికి కంటే ఎక్కువ వర్క్ చేసేది రైటర్సే. అందుకే ప్రతి ఒక్కరూ ఫస్ట్ రైటర్స్ కి గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.

బన్ని ఇంకా మాట్లాడుతూ..ఈ సినిమాలో హీరోయిన్ నటించిన ప్రియాంక మన తెలుగమ్మాయే. అమ్మాయిలు పరిశ్రమకు మరింత ఆత్మ విశ్వాసంతో రావాలి. మిగిలిన అన్ని సినీ పరిశ్రమల్లో కన్నా, అమ్మాయిలకి ఎక్కువ గౌరవం ఇచ్చేది మన తెలుగు చిత్ర పరిశ్రమే. ఇక విజయ్‌ దేవరకొండలో ఒరిజినాలిటీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

కాగా టాక్సీవాలా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. ఈ చిత్రం ‘U/A’ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు