
పబ్లిక్ ఫండింగ్ కాన్సెప్ట్ తో ఈ నెల 21న అవార్డు విన్నింగ్ సినిమా ‘నా బంగారు తల్లి’ విడుదలకానుందని 123తెలుగు ముందుగానే తెలిపింది. తాజా సమాచారం ప్రకారం నిర్మాత సునీతా కృష్ణన్ కి నటి అక్కినేని అమల ధన సహాయం అందిస్తున్నారట
అమల తన సహాయమే కాక పబ్లిక్ హెల్ప్ తీసుకోమని సూచించారట. ఇప్పుడు మరికొంతమంది ప్రముఖులు ఈ సినిమాకు అండగా నిలిచారు. ప్రస్తుతం రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా విడుదలకానుంది. నా బంగారు తిల్లి సినిమా మానవీయ సంబంధాల నడుమ విడుదలై మూడు అవార్డులను సొంతం చేసుకుంది