‘అల వైకుంఠపురములో’.. డబ్బింగ్ మొదలైంది !

‘అల వైకుంఠపురములో’.. డబ్బింగ్ మొదలైంది !

Published on Nov 11, 2019 3:00 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ యంగ్ హీరో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని సుశాంత్ సీన్స్ ను షూట్ చేసేశారు. కాగా తాజాగా ఈ సినిమా కోసం సుశాంత్ తన పాత్రకు ఈ రోజు నుంచి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సుశాంతే ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు