
‘అందాల రాక్షసి’ సినిమాతో వెండితెరకు పరిచయమైనా జంట లావణ్య త్రిపాటి మరియు నవీన్ చంద్ర. ఈ సినిమా తరువాత ఇద్దరికీ మంచి ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లచ్చిమి దేవికి ఒక లెక్కుంది(LOL) సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. వీరి కాంబినేషన్ లో వస్తున్న ఇది మూడవ సినిమా.
ఈ సినిమాకు రాజమౌళి శిష్యుడు జగదీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. జూన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రైమ్ కామెడీలో లావణ్య సరికొత్త పాత్రలో కనిపించనుందని సమాచారం.

