‘ఊర్వశి రౌతేలా’కి మరో బంపర్ ఆఫర్ ?

‘ఊర్వశి రౌతేలా’కి మరో బంపర్ ఆఫర్ ?

Published on Feb 24, 2025 8:58 AM IST

బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ సినిమాలో ఊర్వశి రౌతేలాకి మంచి పాత్ర దక్కింది. ఆమె పాత్రలో గ్లామర్ తో పాటు యాక్షన్ కూడా బాగానే హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో ఊర్వశి రౌతేలాకి మరో బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమాలో ఊర్వశి రౌతేలాకి ఛాన్స్ దొరికిందట. ఇప్పటికే, ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలైంది. వచ్చే షెడ్యూల్ లో ఊర్వశి రౌతేలా కూడా షూట్ లో జాయిన్ కానుంది.

కాగా ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్‌లో తారక్‌ లేని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. మార్చి నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను రెడీ చేస్తున్నారు. ఈ సెట్ లోనే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ స్టార్ట్ కాబోతుంది. ఈ పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్‌ కనిపించబోతుంది. మలయాళ యువ హీరో టొవినో థామస్‌ కీలక పాత్రలో నటించనున్నాడు.

ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆ మధ్య ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ మూవీని తీస్తున్నాను. ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు