ప్రముఖ నిర్మాతలతో రానా నుంచి మరో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్.!

ప్రముఖ నిర్మాతలతో రానా నుంచి మరో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్.!

Published on Apr 30, 2021 4:00 PM IST

దగ్గుబాటి రానా మన టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోలలో పాత్ర కోసం ఎంతవరకు వెళ్లే అతి తక్కువ మందిలో ఒకడు. తన మొదటి సినిమా నుంచి కూడా విలక్షణమైన సబ్జెక్టులు ఎంచుకుంటూ ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియన్ స్థాయిలో కూడా ఆనతి కాలంలోనే సినిమాలు చేసేసాడు. మరి అలాంటి రానా నుంచి ఇప్పుడు మరో పాన్ ఇండియన్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.

విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమా నిర్మించనున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుంది.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ‘టాప్ హీరో’, ‘దేవుడు’, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘జంబలకిడి పంబ’, రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ సినిమాలను ఆచంట గోపినాథ్ నిర్మించారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ ‘ఇమైక్క నొడిగల్’ను తెలుగులో ‘అంజలి సిబిఐ’గా విడుదల చేశారు. కొంత విరామం తర్వాత రానా దగ్గుబాటి హీరోగా భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు ఆచంట గోపినాథ్, సీహెచ్ రాంబాబు మాట్లాడుతూ “ప్రస్తుతం రానా చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత మా సినిమా ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ కథ ఓకే అయ్యింది. కథ, కథనం, హీరో పాత్ర చిత్రణ కొత్తగా ఉంటాయి. దర్శకుడు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు