ఎన్టీఆర్ 100వ జయంతిలో బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ఎన్టీఆర్ 100వ జయంతిలో బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on May 28, 2022 11:14 AM IST

ఈరోజు నందమూరి అభిమానులకి ఒక ప్రతిష్టాత్మక దినం కాగా ఈరోజు తెల్లవారు జాము నుంచి నందమూరి కుటుంబం మరియు అభిమానులు ఈ యుగపురుషుని నూరవ జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ క్రయక్రమంలో నందమూరి తారక రామారావు వారసుడు ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరో మరియు ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం వైరల్ గా మారింది.

“తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానని ముందుకొచ్చారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారు. నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. నిమ్మకూరు చెరువు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు. 35 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అంతా తీర్మానించాం. యువకులు రాజకీయాల్లోకి రావాలి.. ఉత్సాహంతో పనిచేయాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అంతా చూస్తున్నారు. రాష్ట్ర పరిస్థితిపై మహానాడులో పూర్తిగా మాట్లడతా” అని పలు కీలక కామెంట్స్ ని చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు