‘అఖండ’ కూడా పోస్ట్ ఫోన్ అయిందా ?

‘అఖండ’ కూడా పోస్ట్ ఫోన్ అయిందా ?

Published on Apr 18, 2021 9:32 PM IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నట సింహం బాలయ్య బాబు హీరోగా రాబోతున్న ‘అఖండ’ సినిమా షూటింగ్ సెట్ లో కూడా కరోనా కేసులు నమోదు అయ్యాయట. అందుకే ప్రస్తుతానికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారట. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక అఖండ టీజర్ లో బాలయ్య అఘోర పాత్రలో రౌద్రంగా కనిపించి అలరించారు. అన్నట్టు ఈ సినిమాలో ఆధ్యాత్మికతతో ఈ అఘోర పాత్ర చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందట.

ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు