ఆగష్టులో ప్రారంభం కానున్న ‘భీష్మ’ !

ఆగష్టులో ప్రారంభం కానున్న ‘భీష్మ’ !

Published on Jul 16, 2018 12:27 AM IST


నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. ‘ఛలో’ మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ ఫుల్ స్క్రిప్ట్ పూర్తి చేశారట. ఆగస్టు మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

కాగా ప్రస్తుతం నితిన దిల్ రాజు నిర్మాణంలో జరుగుతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఆగష్టు నాటికి నితిన్ పూర్తిగా భీష్మ చిత్రానికి అందుబాటులో ఉండనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన హన్సికను హీరోయిన్ గా నటిస్తోంది. గతంలోనే నితిన్ హన్సిక ‘సీతారాముల కళ్యాణం లంకలో’ అనే చిత్రంలో కలిసి నటించారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు