లేటెస్ట్ : ‘భీష్మ’ త్రయం నుండి రేపు కొత్త మూవీ అనౌన్స్ మెంట్

లేటెస్ట్ : ‘భీష్మ’ త్రయం నుండి రేపు కొత్త మూవీ అనౌన్స్ మెంట్

Published on Mar 21, 2023 11:55 PM IST

ఛలో మూవీ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన యువ దర్శకుడు వెంకీ కుడుముల ఆ మూవీతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. నాగశౌర్య, రష్మిక మందన్న హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అనంతరం నితిన్, రష్మిక మందన్న కలయికలో వెంకీ తెరకెక్కించిన మూవీ భీష్మ. ఇక రిలీజ్ తరువాత ఈ మూవీ కూడా పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది.

అయితే మరొక్కసారి వెంకీ కుడుముల, రష్మిక మందన్న, నితిన్ త్రయం కలిసి ఒక మూవీ చేయడానికి సిద్ధం అయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం కానున్న ఈ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ మూవీ అనౌన్స్ మెంట్ రేపు ఉగాది సందర్భంగా సాయంత్రం 4 గం. 5 ని. లకు రానున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మరి ఈ మూవీ గురించిన పూర్తి డీటెయిల్స్ తెలియాలి అంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు