ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి

ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి

Published on Jul 3, 2020 8:04 AM IST

దాదాపు నాలుగు దశాబ్దాలు కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్ కి సేవలు అందించిన సరోజ్ ఖాన్ నేడు ముంబైలో మరణించారు. ఆమె వయసు 71గా తెలుస్తుంది. కొద్దిరోజుల క్రితం శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఆమె ముంబైలోని ఓ ప్రముఖ హాస్పిటల్ నందు జాయిన్ అయ్యారు. చికిత్స తీసుకుంటున్న ఆమెకు గుండెపోటు రావడంతో మరణించినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లో ఈ విషయం మరో విషాదం నింపింది.

సరోజ్ ఖాన్ కొరియోగ్రాఫర్ గా 2000 లకు పైగా పాటలకు పనిచేయడం విశేషం. 40ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆమె మూడు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు. దేవదాసు చిత్రంలోని ‘డో లారే డో’ సాంగ్ కి ఆమె కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సాంగ్ ఏక్ దో తీన్…సాంగ్ కి కూడా ఆమె కొరియోగ్రఫీ అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు